30.7 C
Hyderabad
April 29, 2024 06: 35 AM
Slider రంగారెడ్డి

AP Special: దేశంలోనే తొలిసారి గ్యాస్ సిలెండర్ లో గంజాయి స్మగ్లింగ్

#ganja

గత ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ ఏం సాధించింది? చాలా సాధించింది. కొత్త తరహాలో గంజాయి స్మగ్లింగ్ చేయడం అందులో మొదటిది. పోలీసులే విస్తుపోయే విధంగా ఆంధ్రా నుంచి గంజాయి స్మగ్లింగ్ చేస్తూ కొందరు తెలంగాణ లో పట్టుబడుతున్నారు. ఆంధ్రా నుండి ఆగ్రా కు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఉత్తరప్రదేశ్ ముఠాను SOT మేడ్చల్ పోలీసులు పట్టుకోవడం సంచలనంగా మారింది. రూ 19,50,000 /- విలువగల  65 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక నిర్దిష్టమైన సమాచారం అందుకున్న సైబరాబాద్ SOT మేడ్చల్ పోలీసులు ORRపై అనుమానాస్పదంగా నిలిపిన రెండు కార్లను తనికీ చేయగా ఈ విషయం బయటపడింది.

ఉత్తరప్రదేశ్ కు చెందిన వ్యక్తులుగా గుర్తించి రెండు కార్లను సమూలంగా తనకీ చేయగా కార్లలోని సీట్ లలో దాచి ఉంచిన గంజాయిని గుర్తించారు. అలాగే అనుమానాస్పదంగా కార్ ఇంజిన్ కు కనెక్ట్ చేయకుండా ఉంచిన CNG సిలిండర్ గురించి ప్రశ్నించగా సిలిండర్ ను కట్ చేసి అందులో కూడా గంజాయి ని అమర్చి యధావిధిగా వెల్డింగ్ చేసి అనుమానం రాకుండా కార్ డికీలలో ఉంచడం జరిగింది. కొత్త తరహాలో ఏపి నుంచి గంజాయి స్మగ్లింగ్ జరగడం పోలీసులనే ఆశ్చర్య పరుస్తున్నది. CNG సీలిండర్లలో గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడటం దేశంలోనే మొదటి సారి కావడం గమనార్హం.

Related posts

అభివృద్ధి నిర్మాణ పనులకు నిధులు కేటాయించాలి

Satyam NEWS

సిపిఐ నేతలతో మంత్రి జగదీశ్ రెడ్డి భేటీ

Bhavani

స్కాములతో రాష్ట్రాన్ని అభాసు పాలు చేస్తున్న బీ ఆర్ ఎస్

Satyam NEWS

Leave a Comment