తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తాను చేపట్టిన 5 వ విడత ప్రజా సంగ్రామ యాత్ర మరికొద్ది సేపటిక్రితం ముగిసింది. ఈ క్రమంలో ముగింపు సభ ను కరీంనగర్ భారీ స్థాయిలో కమలదళం నిర్వహించింది. ఈ నేపథ్యంలో ప్రజలు భారీగా సభాస్థలికి చేరుకున్నారు. పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ కి, కరీంనగర్ లో అడుగడుగునా… ఘనస్వాగతం పలుకింది పార్టీ క్యాడర్. బండి సంజయ్ పై పూల వర్షం కురిపించి, తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.., తన పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తలు.
‘జెసిబి’ లతో బండి సంజయ్ పై పూల వర్షం కురిపించింది కాషాయ దండు. కరీంనగర్ లోని కొత్తపల్లి మున్సిపాలిటీ, జయశంకర్ కాలనీ వద్ద.. బండి సంజయ్ కి హారతులు పట్టి, నుదుట బొట్టు పెట్టి, ఘన స్వాగతం పలికుతున్నారు ఆడపడుచులు. “ట్రిపుల్ తలాక్” ను రద్దు చేసిన నేపథ్యంలో… బిజెపి పై అభిమానంతో బండి సంజయ్ కి రాఖీ కట్టి, కరీంనగర్ లోకి ఘన స్వాగతం పలికారు ముస్లిం సోదరీమణులు, మహిళలు.