32.2 C
Hyderabad
May 16, 2024 14: 53 PM
Slider నిజామాబాద్

షికారుకు వెళ్లి గుహలో ఇరుక్కుపోయిన యువకుడు

#young man

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో విషాదఘటన చోటుచేసుకుంది. మండలంలోని రెడ్డిపేట గ్రామానికి చెందిన షాఢ రాజు అడవిలో షికారుకు వెళ్లి కొండ రాళ్ళ గుహలో ఇరుక్కుపోయాడు. మంగళవారం సాయంత్రం రెడ్డిపేట నుంచి ఘన్ పూర్ తండా మీదుగా సింగరాయిపల్లి అటవీ ప్రాంతంలో రాజు షికారుకు వెళ్ళాడు. షికారు చేస్తున్న సమయంలో రాళ్ళ పైనుంచి వెళ్తుండగా రాళ్ళ మధ్యలో ఉన్న గుహలో రాజు పడిపోయాడు.

బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో అందులోనే ఉండిపోయాడు. అయితే రాజు రాకపోయేసరికి కుటుంబ సభ్యులు వెతకగా రాళ్ళ గుహలోంచి శబ్దం రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం రెండు గ్రామాల ప్రజల సహకారంతో పోలీసులు రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి

Related posts

అంతర్గత కుమ్ములాటలతో సక్రమంగా సాగని ‘కారు’

Satyam NEWS

శత చిత్ర దార్శనికుడికి నివాళులు

Satyam NEWS

ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసు సిబ్బందికి రివార్డులు

Satyam NEWS

Leave a Comment