కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో విషాదఘటన చోటుచేసుకుంది. మండలంలోని రెడ్డిపేట గ్రామానికి చెందిన షాఢ రాజు అడవిలో షికారుకు వెళ్లి కొండ రాళ్ళ గుహలో ఇరుక్కుపోయాడు. మంగళవారం సాయంత్రం రెడ్డిపేట నుంచి ఘన్ పూర్ తండా మీదుగా సింగరాయిపల్లి అటవీ ప్రాంతంలో రాజు షికారుకు వెళ్ళాడు. షికారు చేస్తున్న సమయంలో రాళ్ళ పైనుంచి వెళ్తుండగా రాళ్ళ మధ్యలో ఉన్న గుహలో రాజు పడిపోయాడు.
బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో అందులోనే ఉండిపోయాడు. అయితే రాజు రాకపోయేసరికి కుటుంబ సభ్యులు వెతకగా రాళ్ళ గుహలోంచి శబ్దం రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం రెండు గ్రామాల ప్రజల సహకారంతో పోలీసులు రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి