27.7 C
Hyderabad
April 30, 2024 09: 04 AM
Slider విశాఖపట్నం

ఏపీ రాజధానిపై వైవీ సుబ్బారెడ్డి  సంచలన వ్యాఖ్యలు

#YV Subbareddy

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని, ప్రత్యేక హోదా అంశాలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జ్‌ వైవీ సుబ్బారెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వైజాగ్‌లో పరిపాలన రాజధాని ఏర్పాటు అయ్యే వరకూ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను ఉంచే అంశంపై కేంద్రంతో చర్చిస్తామని సుబ్బారెడ్డి అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇంకా రాజధాని నిర్మాణం పూర్తికాలేదన్నారు. పైగా ప్రస్తుతం ఏపీలో రాజధాని నిర్మాణం చేపట్టే పరిస్థితి లేదని.. వాస్తవ పరిస్థితుల్ని రాజ్యసభలో ప్రస్తావిస్తామన్నారు. ఉమ్మడి రాజధాని కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. జూన్‎తో రాజధాని గడువు ముగియనుండటంతో మరికొన్ని రోజులు పొడిగించాలని కోరుతామన్నారు.

Related posts

రాజకీయ నాయకుల్లా కొట్లాడుకుంటున్న పోలీసులు

Satyam NEWS

స్వ‌ర్ణ‌క‌వ‌చాలంకృత క‌న‌క‌దుర్గాదేవి

Satyam NEWS

పెద్దమందడి పోలీసులపై హైకోర్టుకు ఫిర్యాదు

Satyam NEWS

Leave a Comment