ఉత్తరప్రదేశ్ లో యువతి పై అత్యాచారం, హత్య సంఘటనపై నిర్మల్ కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేసింది. దళిత యువతి పై అత్యాచారం చేసిన వారిని రక్షిస్తున్న అక్కడి ప్రభుత్వాన్ని, అధికారులను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మైనార్టీ చైర్మన్ సాజిద్ ఖాన్, జెడ్పీటీసీలు గణేశ్ రెడ్డి,మల్లెపూల నర్సయ్య, నర్సింగ్రావు,నగేష్,రాహుల్,షకీల్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీలతో పోలీసుల అనుచిత ప్రవర్తన కు వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
నిర్మల్ పట్టణంలోని అంబెడ్కర్ చౌక్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సత్యాగ్రహదీక్ష కార్యక్రమం నిర్వహించారు. ముందుగా అంబెడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిoచారు.