28.7 C
Hyderabad
May 6, 2024 02: 30 AM
Slider ముఖ్యంశాలు

పుప్పల కళ్యాణి ని అభినందించిన మంత్రి ఎర్రబెల్లి

#MinisterDayakarRao

ఉమ్మడి వరంగల్ జిల్లా (రూరల్) ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్ గ్రామానికి చెందిన పుప్పల రమ – కుమారస్వామి దంపతుల కూతురు కళ్యాణి సిద్దిపేట జిల్లా ములుగు ఫారెస్ట్ కాలేజీ లో చదువుతూ జాతీయ స్థాయిలో రెండు ఉత్తమ ర్యాంకులు సాధించి, దేశంలోని రెండు ప్రతిష్టాత్మక యూనివర్సిటీ లలో రెండు సీట్లు సాధించింది.

డెహ్రాడూన్ FRI లో OBC కేటగిరీలో మొదటి ర్యాంకు సాధించి MSc Scince and Technology లో సీటు సంపాదించి. అలాగే,  వారణాసి (కాశీ) బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో 13వ ర్యాంక్ సాధించి ఎమ్మెస్సీ అగ్రికల్చర్ ఫారెస్ట్రీ విభాగంలో ను సీటు సంపాదించి రెండు చోట్ల సీటును సాధించి ఉత్తమ ప్రతిభ ను కనబరిచిన కళ్యాణి ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కళ్యాణి కి ఫోన్ చేసి అభినందించారు.

ఇలాంటి ఉత్తమ ప్రతిభ కనబరిచి ఉమ్మడి వరంగల్ జిల్లా ఖ్యాతిని దేశం నలుమూలల వ్యాపింప చేస్తున్నందుకు అభినందనలు తెలిపారు. విద్యార్థులు కళ్యాణి ను ఆదర్శంగా తీసుకోవాలి అని మంత్రి కొనియాడారు.

Related posts

పాఠశాలలు తెరిచే వేళ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం

Satyam NEWS

నేస్తం, కల్వకుంట్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నోట్ బుక్స్, పెన్నుల పంపిణీ

Satyam NEWS

కాలనీ సమస్యలపై ఎమ్మెల్యే కాలేరు సమీక్ష

Satyam NEWS

Leave a Comment