మేడారం సమ్మక్క- సారలమ్మ వనదేవతలను తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు డోలు వాయిద్యాలతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం అధికారులు శాలువతో మంత్రిని సన్మానించారు. పసుపు, కుంకుమ తల్లులకు సమర్పించి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ వారి కుటుంబ సభ్యుల పేర్లమీద మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, గౌరవ సీఎం కేసీఆర్ పై నిరంతరం అమ్మవారి దీవెనలు ఉండాలని, వారు ఆయురారోగ్యాలతో చిరకాలం జీవించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్ తో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్, జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య, ఐటీడీఏ పీవో అంకిత్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్, ఎ యస్ పి సుదీర్ రామ్నాద్ కేకన్, ఆర్డి ఓ రమాదేవి,ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
previous post