కడప జిల్లా వల్లూరు పుష్పగిరి పెన్నానదిలో గురువారం నలుగురు యువకులు గల్లంతు అయ్యారు.సరదాగా ఈతకు వెళ్లి నదిలో గల్లంతు అయ్యారు. గల్లంతు అయిన వారు కడప నగరంలోని బెల్లంమండి వీధికి చెందినవారుగా గుర్తించారు. యువకులు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లినారు.
మూడు మృతదేహాలు పటాన్ అబ్దుల్ రషీద్ (18), పటాన్ జావెరియా (12 ),అనుష్ ఖాన్(15) లభ్యం అయ్యాయి. మరో మృతదేహం కోసం గాలిస్తున్నారు.గల్లంతైన మరో ఒకరి కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. యువకుల మృతితో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.