తెలంగాణ కోసం బీజేపీ మాత్రమే అంకితభావంతో పనిచేసిందని బీజేపీ జాతీయ నాయకులు, మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జి పి మురళీదరరావు అన్నారు. హైదరాబాద్ అంటే నాలుగు వందల సమాధులు కాదని నాలుగు వేల చరిత్ర ఉన్న నగరమని మురళీధరరావు అన్నారు. భాష గురించి నీతులు చెప్తోన్న కేటీఆర్.. మెదట తన నోటిని ఫినాయిల్ తో సాఫ్ చేసుకోవాలని మురళీ ధరరావు అన్నారు.
వ్యవసాయ చట్టాలపై పార్లమెంట్ లో చర్చ జరగలేదన్న మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. ఆలయ భూములను ఆక్రమించిన నేతలను చౌరస్తాలో అగ్గిమీద నిలబెడతామని హెచ్చరించారు..మురళీధరరావు. ఇక దేవాలయాలు, చెరువులు,గ్రానైట్, ఇసుకను మాయం చేసేని చరిత్ర టీఆర్ఎస్ దేననికాంగ్రెస్ నాయకత్వం చేతకాని అసమర్థత విధానాలను మాత్రమే ప్రధాని ప్రస్తావించారని స్పష్టం చేసారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పద్దతులను విమర్శిస్తే.. తెలంగాణను అవమానించినట్లా? అని మురళీ ధరరావు ప్రశ్నించారు కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు కవల పిల్లల మాదిరి వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులతో కలసిన టీఆర్ఎస్ కు ప్రజలు బుద్ధి చెప్తేందుకు సిద్ధంగా ఉన్నారని జోస్యం చెప్పారు. ప్రజల మెప్పుతో తెలంగాణలో రామరాజ్య స్థాపించేవరకు పోరాడుతామని హామీ ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్రం కోసం బీజేపీ మాత్రమే రాజీలేని పోరాటం చేసిందన్నారు. శ్రీరామ నగరంతో హైద్రాబాద్ ప్రపంచ పటంలో చిరస్థాయిగా నిలిచిపోనుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు స్పష్టం చేశారు.