నిజామాబాద్ జిల్లా లోని బాల్కొండ నియోజకవర్గం ముప్కాల్ మండలం వెంచిర్యాల్ లింబారెడ్డి వ్యవసాయ క్షేత్రం లో సాగుచేస్తున్న హిమాచల్ ఆపిల్ తోట ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నేడు పరిశీలించారు. యాపిల్ తోటను సందర్శించి రైతును మంత్రి అభినందించారు.
తెలంగాణ యాపిల్ గా ప్రసిద్ధి చెందుతున్న ఈ రకం యాపిల్ సాగు మంచి ఫలాలు ఇవ్వాలని ఆయన కోరుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచిస్తున్న లాభసాటి వ్యవసాయ విధానం అంటే ఇదేనని మంత్రి అన్నారు. కొత్తసాగు విధానం అంటే ఇలాంటి లాభదాయకంగా ఉండే పంటలు వేసుకోవడమేనని మంత్రి అన్నారు.
తన నియోజకవర్గంలో ఇలాంటి ప్రయోగాత్మక యాపిల్ తోట పెంచడం ఎంతో సంతోషాన్నిస్తోందని మంత్రి ఆనందం వ్యక్తం చేశారు.