పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ కమిటీ సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం గరిడేపల్లి మండల కేంద్రంలో తహసీల్దార్ కు నేడు వినతి పత్రం సమర్పించారు.
పిఆర్సి వెంటనే అమలు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. అదే విధంగా DA బకాయిలు వెంటనే చెల్లించాలని కోవిడ్ నేపథ్యంలో ఆగిన మూడు నెలల సగం జీతం బకాయిలను నగదు రూపంలో చెల్లించాలని జేఏసీ నాయకులు కోరారు.
ఈ కార్యక్రమంలో STUTS మండల అధ్యక్షుడు పాలూరి అంజయ్య, UTF ప్రధాన కార్యదర్శి భానోతు నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు పెండెం రాంబాబు ,సిహెచ్ సైదులు , సత్థూరి బిక్షం తదితరులు వారు పాల్గొన్నారు.