పనుల్లో అలసత్వం లేకుండా నాణ్యత ప్రమాణాలను పాటించి నిర్మాణ పనులను పూర్తి చేయాలని గ్రామాల అభివృద్ధికి అధికారులు ప్రజా ప్రతినిధులదే కీలక బాధ్యత అని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ శర్మన్ అన్నారు.
మంగళవారం రెండోవ రోజు అచ్చంపేట డివిజన్ పరిధిలో కొనసాగిన కలెక్టర్ శర్మన్ పర్యటన కొనసాగించారు. రెండు రోజులు, 6 మండలాలు, 35 గ్రామాలు, పర్యటించి పల్లెల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. అచ్చంపేట అమ్రాబాద్ పదర మండల పరిధిలోని గ్రామాల్లో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ముందుగా అచ్చంపేట పరిధిలోని పలక పల్లి, పుల్ జాల, నడింపల్లి రంగాపూర్ బొమ్మనపల్లి ఘనపూర్ ఐనోల్ సిద్ధాపూర్ అమ్రాబాద్ మండల పరిధిలోని అమ్రాబాద్, బి కే లక్ష్మాపూర్ కుమ్మరోని పల్లి, మన్ననూర్ పదర మండల పరిధిలోని చిట్లం కుంట ఇప్పలపల్లి పదర గ్రామాల్లో కొనసాగుతున్న రైతు వేదికల నిర్మాణాలు పల్లె ప్రకృతి వనాలను కలెక్టర్ శర్మన్ పరిశీలించారు.