ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ సిఎం సహాయ నిధి రూ.89,500 చెక్కులను పంపిణీ చేశారు.ఈ చెక్కులను మల్లంపల్లి గ్రామంలో లబ్ది దారులకు శనివారం అందజేశారు. ములుగు మండలం ఉమ్మాయి నగర్ గ్రామానికి చెందిన పెండ్లి రాజుకు రూ. 60 వేలు, గుర్రెవుల గ్రామానికి చెందిన పప్కా శ్రీనివాస్ కు రూ. 12 వేలు, ఎల్లారెడ్డి పల్లి గ్రామానికి చెందిన హెచ్. రవి రూ. 17,500 రూపాయలను చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఎం సహాయ నిధి బడుగు, బలహీన వర్గాల కోసం ఏర్పాటు చేశామన్నారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ములుగు మండల అధ్యక్షుడు బాదం ప్రవీణ్, మల్లంపల్లి ఎంపిటిసి ప్రభాకర్, మల్లంపల్లి గ్రామ సర్పంచ్ కుమారస్వామి, సీనియర్ నాయకులు గోవిందు నాయక్, రైతు బందు చైర్మన్ పల్లా బుచ్చయ్య, ఓడిసిఎంఎస్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, కొత్తగూడెం మండల అధ్యక్షుడు వేణు తదితరులు పాల్గొన్నారు.