తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ కు త్వరలో స్థానచలనం కలగబోతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇవోగా నియమితుడైన అనిల్ కుమార్ సింఘాల్ వైసిపి అధికారంలోకి వచ్చినా కూడా ఇంత కాలం కొనసాగారు. టిటిడి చైర్మన్ గా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి సుబ్బారెడ్డి నియమితులైన నాటి నుంచి కూడా సింఘాల్ ను ట్రాన్సఫర్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఏం జరిగిందో ఏమో కానీ ఆయనను బదిలీ చేసేందుకు ప్రభుత్వంలో చర్యలు ప్రారంభం కాలేదు. ఇప్పుడు తాజాగా జరిగిన పరిణామాలలో ఆయనను బదిలీ చేసేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం అయినట్లు తెలిచింది. సింఘాల్ స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన జెఎస్ వి ప్రసాద్ ను నియమించబోతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అనిల్ కుమార్ సింఘాల్ ను బదిలీ చేసి ఢిల్లీలో రెసిడెంట్ కమిషనర్ గా నియమించబోతున్నారు.
previous post