బాన్స్ వాడలో టీఎన్జీఓ యూనియన్ కార్యవర్గ సమావేశం ఆర్ అండ్ బీ అతిథి గృహంలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా కామారెడ్డి జిల్లా టీఎన్జీఓ యూనియన్ అధ్యక్షులు దయానంద్, ఉపాదక్ష్యులు సాయిలు, జాయింట్ సెక్రటరీ జే శ్రావణ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ బాబా పాల్గొన్నారు. మూడు సంవత్సరాల కాల పరిమితి, తాలూకా ఎన్నికలు ఎన్నికల అధికారి ఎన్. వెంకట్ రెడ్డి నిర్వహించగా మొత్తం సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు.
గత మూడు సంవత్సరాల నుంచి ఉన్నఅధ్యక్ష, కార్యదర్శులు యథావిధిగా అదే హోదాలో ఉండేలా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రస్తుతం 2020 నుంచి 2023 వరకు నూతనంగా ఎన్నుకోబడ్డ యూనియన్ కార్యకలాపాలు నడిపిస్తున్నారు.
నూతన కార్యవర్గం
అధ్యక్షులుగా ఎస్ వెంకట్, కార్యదర్శిగా ఎం. అనిల్ కుమార్, కోశాధికారిగా బి. సాయిలు, ఆర్గ నైజింగ్ సెక్రెటరీగా ఎం. కిషన్ తదితరులను ఉపాధ్యక్షులను, జాయింట్ సెక్రెటరీలుగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నుకున్నఅధ్యక్షులు మాట్లాడుతూ టీఎన్జీఓ కేంద్ర సంఘం ఆధ్వర్యంలో ఈ నెలాఖరు వరకు ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నపీఆర్సిని ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉందన్నారు. ఉద్యోగుల ఎలాంటి సమస్యలు ఉన్నా తాను ముందుండి జిల్లా సంఘం దృష్టికి తీసుకొని వెళ్లి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.