ప్రపంచమంతా ప్రస్తుతం కరోనా విలయతాండవం చేస్తుంటే అందుకు విరుద్ధంగా కరోనా నిబంధనలు పాటించాల్సి ఉండగా శ్రీకాకుళం పట్టణంలోని ఏ .వి .ఎన్. ఎం .హెచ్. ( వరం మునిసిపల్ ఉన్నత పాఠశాల) లో అలా జరగడం లేదు.
ఆర్ట్, క్రాఫ్ట్ ఒప్పంద ఉపాధ్యాయులుగా పని చేస్తున్న ఇద్దరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, విద్యాశాఖ అధికారుల ఆ దేశాలకు వ్యతిరేకంగా నేడు విద్యార్థిని విద్యార్థులకు సామాజిక దూరం కూడా పాటించకుండా చిత్రలేఖనం, డెబిట్ టు, క్విజ్ పోటీలను నిర్వహించారు.
పోటీలను నిర్వహించినప్పుడు విద్యార్థులు భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఈ ఆర్ట్, క్రాఫ్ట్ , సమగ్ర శిక్ష ఉపాధ్యాయులు పట్టించుకోలేదు. కరోనా వ్యాధి విజృంభిస్తున్న సమయంలో విద్యార్థుల జాగ్రతలు తీసుకోవాల్సి ఉంది.
ఈ సంఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారులు విచారణ చేసి , బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, పాఠశాల తల్లిదండ్రులు కోరుతున్నారు.