26.7 C
Hyderabad
May 16, 2024 08: 03 AM
Slider నల్గొండ

పార్టీలకతీతంగా సమస్యలు పరిష్కరించాలి

#yaragani

పార్టీలకు అతీతంగా వివిధ సమస్యలపై తమ వద్దకు వచ్చే ప్రజలకు సత్వరమే సమస్యలను పరిష్కరించాలని ఐ ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,టి పి సి సి ప్రచార కమిటీ సభ్యుడు,మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ యరగాని నాగన్న గౌడ్ హుజూర్ నగర్ ఆర్ డి ఓ ఎన్.జగదీశ్వర్ రెడ్డిని కోరారు.  

ఇటీవల సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఆర్డీవో గా బాధ్యతలు స్వీకరించిన ఎన్.జగదీశ్వర్ రెడ్డిని గురువారం యరగాని నాగన్న గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా నాగన్న గౌడ్ మాట్లాడుతూ కెసిఆర్ తెచ్చిన ధరణి పోర్టల్ తో అనేకమంది రైతులు వివిధ సమస్యలతో సతమతమౌతున్నారని, హుజూర్ నగర్ డివిజన్ పరిధిలోని వివిధ గ్రామాలలోని ప్రజలు సంబంధిత తాసిల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారని,అనేకమంది అమాయకుల భూములను పలువురు దళారులు ఆక్రమిస్తున్నారని అన్నారు.ఆక్రమణలకు గురౌవుతున్న అమాయక ప్రజల వ్యవసాయ భూములను రక్షించాలని ఆర్డీవో ని కోరినట్లు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సలిగంటి జానయ్య,బంటు సైదులు,బాలు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

తైక్వాండో పోటీలు విజయవంతం చేయండి

Satyam NEWS

స్పందన మనోవికాస కేంద్రంలో అనితారెడ్డి పుట్టిన రోజు వేడుక

Satyam NEWS

పోలీసుల అదుపులో మావోయిస్ట్ అ్రగనేత భార్య

Satyam NEWS

Leave a Comment