33.7 C
Hyderabad
April 29, 2024 23: 27 PM
Slider సంపాదకీయం

బిజినెస్ మెన్ జగన్ రెడ్డి…

#jagan mohan reddy

జగన్ మోహన్ రెడ్డి ఒక బిజినెస్ మెన్. లాభాపేక్ష లేకుండా ఏ పనీ చేయడు. ప్రజలు ఈ విషయం అర్ధం చేసుకోకుండా కేవలం రాజశేఖరరెడ్డి కొడుకు అనే ఒకే ఒక టైటిల్ తో గెలిపించారు. దాంతో పదవిలోకి వచ్చిన నాటి నుంచి తన వ్యాపారాలను లెక్కకు మించి పెంచుకుంటూ జగన్ రెడ్డి తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నారు.

ప్రభుత్వం నిర్మించే ఇళ్లకు జగన్ కంపెనీలకు చెందిన సిమెంటు మాత్రమే వాడుతున్నారు. ఒక్క సిమెంటు ఏమిటి రాష్ట్రంలోని డిస్టిలరీలు బ్రువరీలు అన్నీ కూడా వారికి సంబంధించినవే. ఇసుక తవ్వే కంపెనీ వారిదే. గనులు, గ్రానైట్ నుంచి ఐరన్ ఓర్ వరకూ అన్ని ఆయనకు సంబంధించినవే. ఇలా ఒక్కటేమిటి? అన్ని ఆయనవే. అయితే తనకు ఏమీ లేవని, తాను ఒక నిరుపేదనని జగన్ చెబుతుంటారు. లక్షల కోట్లు టర్నోవర్ ఉండే కంపెనీలకు ఓనర్ అయిన జగన్ రెడ్డి కుటుంబం తమను తాము పేదవారిగా చెప్పుకోవడం చూస్తుంటే అందరికి ఆశ్చర్యంగా ఉంటుంది.

ఇంత సిగ్గు లేకుండా ఇలా చెప్పుకుటారా అని అందరూ నోరు నొక్కుకుంటున్నారు. అయినా సరే జగన్ రెడ్డి పబ్లిక్ లోకి రాగానే అవే విషయాలు చెబుతుంటారు. అసలు విషయానికి వస్తే తనకు ఏ పేపరూ లేదని పదే పదే పబ్లిక్ మీటింగ్ లలో చెప్పే జగన్ రెడ్డికి సాక్షి అనే పత్రిక, సాక్షి అనే ఛానెల్ ఉన్నాయి.

ఆ పేపర్ మొత్తం, ఆ ఛానెల్ మొత్తం ఆయన ఫొటోలు, వీడియోలే ఉంటాయి. అయితే అది తన ఛానెల్ కాదని జగన్ రెడ్డి నమ్మబలుకుతుంటారు. ఇలాంటి సాక్షి పత్రిక సేల్స్ పెంచుకోవడానికి జగన్ రెడ్డి ఒక భారీ ప్లాన్ వేసుకున్నారు. ప్రభుత్వ ఖర్చుతో సాక్షి కొనుగోలు చేసి అందరికి ఉచితంగా పంచే పథకం ప్రవేశ పెట్టారు. సాక్షి పత్రికకు అయితే ప్రభుత్వ ప్రకటనలు ఇబ్బడి ముబ్బడిగా ఇస్తూనే ఉంటారు.

తాజాగా సాక్షి పత్రికను కొనాలని వాలంటీర్లకు ప్రతీ నెలా రూ.రెండువందలు అదనంగా ఇస్తూ జారీ చేసిన జీవో ఉపసంహరించుకోవాలని ఢిల్లీ హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంటే ప్రభుత్వం ఇప్పటి వరకూ ఆ పేరుతో వాలంటీర్లకు ఇస్తున్నడబ్బులన్నీ అక్రమమే. ఆ డబ్బులన్నీ సాక్షి పత్రిక యాజమాన్యానికే చేరుతున్నాయి. రెండున్నర లక్షల మంది వాలంటీర్లు.. రెండు న్నర లక్షల కాపీల్ని కొంటున్నారంటే మామూలు విషయం కాదు.

ప్రజాధనంతో పేపర్లు కొనిపించి సర్క్యులేషన్ చూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఈనాడు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించంది. ఈ క్రమంలో ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్… తాజాగా గణాంకాల్లోనూ ఈనాడే ముందు ఉందని సాక్షి వెనుక ఉందని తెలిపింది. అంటే ఎంత అధికార దుర్వినియోగం చేస్తున్నా సాక్షి పత్రిక ఈనాడు దరి దాపుల్లోకి కూడా రావడం లేదు.

ఏపీలో సాక్షి దినపత్రికను కొనేవారి సంఖ్య చాలా పరిమితంగా ఉంటోంది. ప్రజాధనంతోనే లక్షల కాపీల్ని కొంటున్నారు. రెండున్నర లక్షల మంది వాలంటీర్లకు రూ. రెండు వందలు ఇచ్చి మరీపేపర్ కొనిపించారు. అలాగే ఒక్కో గ్రామ, వార్డు సచివాలయంలో రెండేసి పేపర్లు వేస్తున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగుల్ని బెదిరించి పేపర్లు కొనిపిస్తున్నారు. యూనివర్శిటీలు సహా ఇతర చోట్ల.. బలవంతంగా పేపర్ అంట కడుతున్నారు.

ఇంత చేస్తున్నా ఆ పత్రిక సర్క్యూలేషన్ … ఏపీలో ఐదారు లక్షల లోపే ఉన్నట్లుగా తెలుస్తోంది. అంటే డబ్బులు పెట్టే కొనే నిఖార్సైన పాఠకులు సాక్షి పత్రికకు పూర్తిగా అడుగంటి పోయారని స్పష్టమవుతోంది. ఖచ్చితంగా ఏపీలో సాక్షికి డబ్బులు పెట్టి కొనే చందాదారులు లక్ష నుంచి రెండు లక్షలు లోపే ఉంటారని భావిస్తున్నారు. ఇంత చేసినా సాక్షి పేపర్ మెరుగుపడకపోవడంతో ప్రభుత్వం మారితే కప్పకూలిపోతుందన్న అనుమానాలు ప్రారంభమయ్యాయి. అసలు సర్క్యూలేషన్ లేకపోయినా వందల కోట్ల ప్రజాధనం .. ఆ పత్రికకు కట్టబెడుతున్నారు.

మొత్తంగా ఈనాడు … కరోనా అనంతర పరిస్థితుల్ని తట్టుకుని నిలబడుతోంది కానీ.. సాక్షి పునాదులు కదిలిపోయాయని… అప్పనంగా దొరకిన అధికారంతో ప్రజాసొమ్ముతో నిలబెడుతున్నారు. అధికారం పోయిన మరుక్షణం సాక్షి దోచిన ప్రజాధనం కక్కించకుండా ఉండరు.

Related posts

అగ్నిపథ్ కు వ్యతిరేకంగా నేడు భారత్ బంద్

Satyam NEWS

సెప్టెంబరు 1న తిరుమలలో అనంత పద్మనాభ వ్రతం

Satyam NEWS

కేంద్రం ప్రవేశ పెట్టిన అద్భుతమైన పథకం ఈ శ్రమ్

Satyam NEWS

Leave a Comment