31.2 C
Hyderabad
May 3, 2024 02: 25 AM
Slider మహబూబ్ నగర్

వనపర్తిలో ఎమ్మెల్యే ఇంటి ముందు హల్చల్

#wanaparthy

కాంగ్రెస్ పార్టీలో చేరికలు, చర్చల పేరిట వనపర్తిలో ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇంటికి వచ్చిన గోపాలపేట మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, తాడిపర్తి మాజీ సర్పంచ్ గణేష్ గౌడ్ పెట్రోల్ పోసుకున్నారు. తాడిపర్తికి చెందిన బిఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ లో చేర్చుకోవద్దని గణేష్ గౌడ్ ఎమ్మెల్యేను కోరారు. గురువారం ఉదయం  తిరుమల అపార్ట్ మెంట్ లో ఉన్న  ఎమ్మెల్యే మేఘారెడ్డి దగ్గర కు చేరికల చర్చ నిమిత్తం వెళ్ళారు. అందుకు ఎమ్మెల్యే మేఘారెడ్డి సమాదానం ఇస్తూ  తాను ఎప్పుడు చేరికలను ప్రోత్సహించా లేదన్నారు.  ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత  పట్టణంలోని రాజీవ్ చౌరస్తా లో  జరిగిన విజయోత్సవ ర్యాలీలో కొత్తగా ఎవరిని పార్టీ లో చేర్ఛుకోనని ప్రకటించిన్నట్లు ఆయన వారికి గుర్తు చేశారు. అయితే,  వనపర్తి నియోజకవర్గంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ ల నాయకులను కాంగ్రెస్ పార్టీ లో చేర్చుకోవడానికి తెరలేపింది  చిన్నారెడ్డి కాదా .! ఆయనను మీరెందకు ప్రశ్నించడం లేదని ఎమ్మెల్యే వారిని అడిగారు.

వెంటనే  పథకం ప్రకారం వారి వెంట తెచ్చుకున్న డిజీల్, పెట్రోల్ ను ఒంటిపై పోసుకున్నారు. అక్కడే ఎమ్మెల్యే  గన్ మేన్లు వెంటనే అప్రమతమై గణేష్ గౌడు ను అయన అనుచరులను పక్కకు తీసుకపోయారు. ఆ పరిస్థితిలో ఎవరైనా నిప్పు రాజేసింటే జరగరాని నష్టం  జరిగేదని అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు తెలిపారు. వెంటనే కాంగ్రెస్ పార్టీ నాయకులు  పోలీసు లకు సమాఛారం ఇవ్వడంతో రూరల్ ఎస్ఐ జలందర్ రెడ్డి తన సిబ్బంది తో  తిరుమల అపార్ట్ మెంట్ కు చేరుకున్నారు. జరిగిన సంఘటనను పోలీసులు ఎమ్మెల్యే మేఘారెడ్డి,కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. చర్చల కే వస్తే…డిజీల్, పెట్రోల్ ఎందుకు తెచ్చిన్నట్లు అని ప్రశ్నించారు. సంఘటన ప్రకారం చర్యలు తీసుకుంటామని వనపర్తి డి ఎస్పీ వెంకటేశ్వర్ రావు తెలిపారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

అజంఖాన్ ఓటు హక్కు రద్దు

Satyam NEWS

దమ్ముంటే చంద్రబాబు నాయుడు సవాల్ ను స్వీకరించండి

Satyam NEWS

నాగావళి నదిలో ఇసుక దీక్ష కు సిద్ధం

Satyam NEWS

Leave a Comment