సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని డిఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ దగ్గుపాటి బాబురావు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా దగ్గుపాటి బాబురావు మాట్లాడుతూ శాస్త్రవేత్తగా దేశ అణు, శాస్త్రీయ రంగాలకు మార్గనిర్దేశనం చేసి, మేధావిగా,తత్వవేత్తగా యువతకు స్ఫూర్తినిచ్చిన మహనీయుడు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అని అన్నారు. అబ్దుల్ కలామ్ మహోన్నత మానవతావాది అని వారి సేవలను నిత్యం స్మరించుకుందామని అన్నారు. ప్రపంచ సామరస్యం, స్థిరమైన అభివృద్ధిని కోరుకోవడం డాక్టర్ అబ్దుల్ కలాం హృదయానికి ప్రియమైన విలువలని,మన దేశం యొక్క శాస్త్రీయ పురోగతిని రూపొందించడంలో కలాం ప్రభావవంతమైన పాత్రను స్మరించుకుందామని అన్నారు.భవిష్యత్ తరాలకు మెరుగైన ప్రపంచాన్ని సృష్టించాలనే కలాం మిషన్ను కొనసాగిద్దామని,అదే అబ్దుల్ కలాం కి మనమిచ్చే నిజమైన నివాళులని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పి.ఎన్.ఆర్.నరసింహారావు,రావులపాటి శ్రీను,ములకలపల్లి రాంబాబు, ములకలపల్లి నరేష్,జవ్వాజి రాంబాబు, మలకలపల్లి నరసింహారావు,సల్వాది పవన్, పిట్టల బాలు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్