అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలంకు శనివారం విచ్చేసిన సినీ నటుడు, ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ అలీ పాఠశాలలోని వివిధ మౌలిక వసతులను ప్రారంభించినారు.ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసిన మినరల్ ఆర్వో ప్లాంట్ మరియు మౌలిక వసతులను అలీ ప్రారంభించారు.ఈ సందర్భంగా స్థానిక వైసీపీ నేతలు అలీ నీ ఘనంగా సన్మానించారు. అలీ ని చూడడానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన స్థానిక ప్రజలు తరలివచ్చారు.
ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ తాను ఈ ఏడాది సినిమాలలోకి వచ్చి 45 సంవత్సరాలు అయ్యిందని అన్నారు. ఇప్పటి వరకు 12 వందల 30 సినిమాలు పూర్తి చేసుకున్నట్టు వెల్లడించారు.
తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయికి ఎదిగిందని అందువల్ల తమ చిత్రాలు అన్నీ బాషల్లో విడుదల చేయడం వల్ల,తాము గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందుతున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రం లోని మలయాళీ డైలాగులు చెప్పి నవ్వులు పూయించారు.