38.2 C
Hyderabad
April 29, 2024 21: 40 PM
Slider ఖమ్మం

30వేల మందికి పైగా గాంధీ చిత్ర వీక్షణ

#Gandhis film

జిల్లాలో గాంధీ చలన చిత్రాన్ని 29373 మంది విద్యార్థినీ విద్యార్థులు, 1211 మంది ఉపాధ్యాయులు వీక్షించారని జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖరశర్మ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు, జిల్లా కలెక్టరు, అదనపు కలెక్టర్ సూచనలు, మార్గనిర్దేశకంలో ఈనెల 16 నుండి 24 వ తేదీ వరకు జిల్లాలోని 17 సినిమా ధియేటర్లలో ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1-30 గంటల వరకు గాంధీ చలన చిత్రాన్ని ప్రభుత్వ ప్రయివేట్ పాఠశాలల విద్యార్ధినీ విద్యారులు తిలకించారని తెలిపారు. సినిమా ప్రదర్శనలకు సంబంధించి ధియేటర్లలో అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవడం

జరిగిందని, బస్సు సౌకర్యం కల్పించి విద్యార్థులను స్కూళ్ల నుండి ధియేటర్లకు, తిరిగి స్కూళ్లకు చేర్చడం జరిగిందని, సినిమా ప్రదర్శనలు అన్ని ధియేటర్లలో ప్రశాంతంగా జరిగాయని ఆయన తెలిపారు. ధియేటర్ల యాజమాన్యాలు, రెవిన్యూ, పోలీస్, మున్సిపల్, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సిబ్బంది, ప్రయివేటు స్కూళ్ల యాజమాన్యాలు గాంధీ చలన చిత్ర ప్రదర్శనలు జిల్లాలో విజయవంతంగా నిర్వహించేందుకు తోడ్పాటునందించారని జిల్లా విద్యా శాఖ అధికారి పేర్కొన్నార

Related posts

అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి

Satyam NEWS

ఢిల్లీలో నేటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్

Satyam NEWS

టీఆర్ఎస్ అంటే మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment