కడప నగరంలోని మహావీర్ సర్కిల్, నూతన కలెక్టరేట్ వద్ద ఉన్న, సుబ్రహ్మణ్యస్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం ఘనంగా జరిగింది.
కడప జడ్పీ చైర్మన్ ఆకే పాట్టి అమర్నాథ రెడ్డి, నగర డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి, 20వ డివిజన్ ఇంచార్జ్ శ్రీరంజన్ రెడ్డి తదితరులు స్వామివారి కల్యాణంలో పాల్గొన్నారు. గోవింద మాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
స్వామివారి కళ్యాణం చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు.