ఎన్ని అడ్డంకులొచ్చినా, అవరోధాలు ఎదురైనా నరసరావుపేట ఎమ్మెల్యేగా డాక్టర్ చదలవాడ అరవిందబాబును చట్ట సభల్లోకి పంపిస్తామని పల్నాడు జిల్లా రావిపాడు గ్రామ ఎస్టీ కాలనీ వాసులు స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కలిసి పని చేస్తాం, తోడుగా నిలిచి గెలిపించుకుంటామన్నారు. దశాబ్దం పాటు జగన్ రెడ్డికి, వారి పార్టీ అభ్యర్ధులకు అండగా నిలిచినా ఏ రోజూ తమను వారు పట్టించుకున్న దాఖలాలు లేవని ఎస్టీ కాలనీ వాసులు అన్నారు. కనీసం రోడ్లు, కాలువలు, తాగునీటి సదుపాయాలు కూడా కల్పించలేకపోయారని వారు వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రజల కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడిన డాక్టర్ చదలవాడ అరవిందబాబుకు అండగా నిలుస్తామన్నారు.
previous post