రైలు ఢీకొని మురికి కాలవలో పడి మృత్యువుతో పోరాడుతున్న వ్యక్తిని కాపాడి అంబులెన్స్ లో సమయానికి హాస్పిటల్ కి తరలించిన సిఐ మధుబాబు హెడ్ కానిస్టేబుల్ భాస్కర్ రెడ్డి అతని ప్రాణాలు కాపాడారు. నగరంలోని S2 థియేటర్ పక్కన అర్ధరాత్రి రెండు గంటల సమయంలో డ్రైనేజీ కాలువలు మృత్యువుతో పోరాడుతూ సహాయం కోసం వేయి కళ్ళతో ఒక వ్యక్తి ఎదురు చూస్తున్నాడు. చిన్న బజార్ సీఐ మధుబాబు హెడ్ కానిస్టేబుల్ భాస్కర్ రెడ్డి అతడిని గమనించి తక్షణ సాయం అందించారు. అతను రైలు ఢీకొని తీవ్ర గాయాలతో మురికి కాలువలో పడ్డాడు. శరీరం మొత్తం తీవ్ర గాయాలు ఉన్నాయి. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సీఐ మధుబాబు, హెడ్ కానిస్టేబుల్ భాస్కర్ రెడ్డి చొరవ తీసుకొని హాస్పిటల్ లో చేర్పించడం తో బాధితుడు ప్రాణాలతో బయటపడ్డాడు. బాధితుడి వివరాలు తెలియాల్సి ఉంది.
previous post