ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చాలా మద్యం షాపుల దగ్గర సోషల్ డిస్టెన్స్ అనేది కూడా కనిపించకుండా పోయింది. లాక్ డౌన్ కారణంగా 45 రోజులు తర్వాత ఉమ్మడి అదిలాబాద్ వ్యాప్తంగా మద్యం దుకాణాలు తెచ్చుకున్నాయి. దీంతో మందు బాబులు ఉత్సాహం పట్టలేక పోతున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మందు షాపులు ముందు ప్రజలు బారులు తీరి కొనుగోలు చేశారు.
మద్యం సేవించాలని ఉత్సాహంతో ఎండలోనైనా సరే మందు కోసం ఎదురు చూశారు. ఈరోజు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు మద్యం షాపులను ఎక్సైజ్ గట్టి పోలీస్ బందోబస్తు మధ్య మద్యం షాపులను తెరిచారు. ప్రజలని కంట్రోల్ చేసే బాధ్యత మద్యం దుకాణం దారులదేనని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు.