ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికలకు సంసిద్ధత ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల అధికారి డాక్టర్ ఎన్ రమేష్ కుమార్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ తో భేటీ కానున్నారు.
బుధవారం ఉదయం 11.30కి గవర్నర్ ను కలిసి పరిస్థితిని ఆయన వివరిస్తారు. గవర్నర్ అనుమతితో తదుపరి చర్యలకు ఉపక్రమించేందుకు అవకాశం ఉంది.
దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపేందుకు గవర్నర్తో భేటీ అయిన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థానిక ఎన్నికలు నిర్వహించలేమని గవర్నర్కు చెప్పినట్టు ప్రచారం జరిగింది.
ఇదిలా ఉంటే రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గాయని, స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కోర్టులో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే అఫిడవిట్ దాఖలు చేసింది.
ఈ నేపథ్యంలో బుధవారం గవర్నర్తో ఎన్నికల కమిషనర్ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.