Slider తూర్పుగోదావరి

ఐఏఎస్ సాధించిన కాకినాడ యువకుడు శ్రీనివాస్ రెడ్డి

#SrinivasReddy

కాకినాడ నగరానికి చెందిన ఐఏఎస్ టాపర్ సాడి శ్రీనివాసరెడ్డి అరుదైన ఘనత సాధించారు. 2021-22కి జరిగిన యూపీఎస్సీ పరీక్షల్లో టాప్ స్థానం దక్కించుకుని ఐఏఎస్ ను ఎంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఐఏఎస్ శిక్షణ పొందుతున్న ముస్సోరిలోని లబసనలో జరిగిన కార్యక్రమంలో ఫౌండేషన్ కోర్సులో టాపర్ గా నిలవడంతో శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముచే రాష్ట్రపతి మెడల్ అందుకున్నారు. అలాగే ఫౌండేషన్ కోర్సులో డైరెక్టర్ గోల్డ్ మెడల్ ను కూడా అందుకున్నారు.

శ్రీనివాస రెడ్డి కాకినాడ జేఎన్టీయూలో బీటెక్ చదవగా ఆర్బిఐ, సెబి వంటి సంస్థల్లో ఉన్నత స్థాయి ఉద్యోగానికి అవకాశాలు వచ్చినా చేరకుండా పట్టుదలతో ఐఏఎస్ కు ఎంపిక అవ్వాలని నిశ్చయించుకున్నాడు. దీంతో ఆయన పోటీ పరీక్షల్లో యూపీఎస్సీలో ఉత్తీర్ణులయ్యాడు.

Related posts

బిసి చైతన్య సభను జయప్రదం చేయండి

Satyam NEWS

అంతర్జాతీయ కరాటే పోటీకి ఎంపికైన శివతేజ

Satyam NEWS

ఐ టి ఎటాక్: ఇక ఇప్పుడు విజయవాడ డాక్టర్ల వంతు

Satyam NEWS

Leave a Comment