ఈనెల 13న,శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం నేరేడుచర్ల మండల కేంద్రంలో జరగబోయే బిసి చైతన్య సభను జయప్రదం చేయాలని బిసి సంఘం నాయకుడు,సూర్యాపేట జిల్లా కమిటీ కన్వీనర్ ధనుంజయ నాయుడు, స్టూడెంట్ విభాగం నాయకురాలు చీకూరి లీలావతి కోరారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య సభను నేరేడుచర్ల మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ నందు ఈనెల 13న, మధ్యాహ్నం 12 గంటలకు ఏర్పాటు చేయడమైనదని,ఈ సభలో బిసిల ఐక్యతను చాటుకోవాలని కన్వినర్ ధనుంజయ నాయుడు,లీలావతి కోరారు.
బిసిల జనాభా 50 శాతం పైగా ఉన్నా నేటికీ పాలకులు మాత్రం కపట ప్రేమతో మోసం చేస్తున్నారని,నిండు భోజనం చూపించి అందులో పిడికెడు మెతుకులను బిసిలకు వేస్తున్నారని, బిసిలంతా మన హక్కుల సాధన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.
బిసి ల ఆత్మగౌరవం కోసం కదిలి వస్తున్న ఆర్.కృష్ణయ్య చైతన్య సభను విజయవంతం చేయాలని వారు కోరారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్