టిప్పర్ కింద పడి ఓవ్యక్తి మృతి చెందారు. శనివారం కొత్తకోట గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి టిఫిన్ చేసేందుకు మండల కేంద్రంలో మొబైల్ టిఫిన్ సెంటర్ దగ్గరికి వెళ్లి అల్పాహారం చేసి తిరుగు ప్రయాణంలో స్కూటీ స్టార్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో కొల్లాపూర్ నుండి పెబ్బేరు వెళ్తున్న టిప్పర్ అదుపుతప్పి శ్రీనివాస్ రెడ్డిని ఢీకొట్టడంతో టిప్పర్ వెనుక భాగం టైర్ల కింద పడడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ద్విచక్ర వాహన మెకానిక్ గా జీవనం కొనసాగిస్తున్న ఈయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నట్లు స్థానికుల సమాచారం.
previous post