మల్దకల్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శనివారం చక్రస్నానం నిర్వహించి బ్రహ్మోత్సవాలకు ముగింపు పలికారు. ఉదయం పంచామృతాభిషేకాలు పూజలు నిర్వహించి ఉత్సవ విగ్రహాలను శేషదాస వంశస్థులు దీరేంద్ర దాస్, రాఘవేంద్రదాస్, విష్ణు దాస్ ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస ఉత్సవ విగ్రహాలకు అవబృత చక్రస్నానం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ ప్రహల్లాద రావు ఈవో సత్య చంద్రారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి స్థానిక రామతీర్థం బావిలో పవిత్ర స్నానాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భీమసేన చారి ,ఎల్కుర్ రాఘవేందర్రావు, అరవిందరావు, రుక్మాంగద రావు, నాగరాజు శర్మ చంద్రశేఖర రావు, బాబురావు తదితరులు పాల్గొన్నారు.