విశాఖపట్నం పీఎం పాలెం పరిధిలో మిథిలాపురి వుడా కాలనీ సచివాలయంలో పనిచేస్తున్న ఇద్దరు వాలంటీర్లు అదృశ్యమయ్యారు. వీరు గత కొద్దికాలం నుంచి ప్రేమించుకున్నట్లు తెలుస్తుంది. వీరిలో మహిళా వాలంటీర్ వివాహిత. ఆమె రెండు రోజులుగా కనిపించడం లేదని భర్త పీఎం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
తన భార్యను అదే సచివాలయానికి చెందిన వాలంటీర్ తీసుకు వెళ్లినట్లు అతను ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ విషయం పై ఇద్దరు వాలెంటిర్లు విధులకు హాజరు కాకపోవడంతో వారిపై చర్యలు తీసుకుంటామని సచివాలయ అడ్మిన్ తెలిపారు.