జగన్ ప్రభుత్వం లో రెండోసారి తన మంత్రి వర్గం లో ఎమ్మెల్యే అంబటి రాంబాబు కు…నీటి పారుదల శాఖ మంత్రి పదవి వరించడంతో…నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని విజయనగరం జనసేన నేత ప్రముఖ వ్యాపార వేత్త గురాన అయ్యలు హెచ్చరించారు. జనసేన అధినేత పవన్ పై…మంత్రి అంబటి మాట్లాడుతూ…
ముగ్గురు పెళ్లాలున్న పవన్… బ్రో సినిమాలో శ్యామ్ కారక్టర్ ఎందుకు సృష్ఠించారో చెప్పాలని తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అలాగే… సినిమా తీసేముందు అన్నీ ఆలోచించి..తీయ్యాలని కూడా మంత్రి అంబటి వ్యాఖ్యానించారు. దీన్ని ఖండిస్తూ…
విజయనగరం జనసేన నేత గురాన అయ్యలు మాట్లాడుతూ… గులివింద గింజ తన నలుపెరగనట్టు వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. మంత్రి పదవి రాగానే… మంత్రి అంబటి చెలరేగి పోతున్నారని…నోరు అదుపులో పెట్టుకోవాలని…గురాన అయ్యలు హెచ్చరించారు.