41.2 C
Hyderabad
May 4, 2024 17: 39 PM
Slider కరీంనగర్

దళిత యువకుల పై దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలి 

#malamahanadu

మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణం లో దళిత యువకులు దొంగతనం చేశారనే నేపంతో చిత్రవధలు చేస్తూ,తీవ్రంగా కొట్టిన వ్యక్తులపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ  కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాలమానాడు సోషల్ మీడియా కోఆర్డినేటర్ అజయ్ జవాజి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మందమర్రి పట్టణానికి చెందిన చాకలి రాములు తన మేకను దొంగలించరని అనే నెపంతో దళిత యువకులైన  తేజ, కిరణ్ ను కాళ్లు చేతులు కట్టేసి,తలకిందులుగా వేలాడదీసి కింద మంట పెట్టి చిత్రవదలు చేస్తూ నరకం చూపిన రాములు, అతని భార్య, కుమారున్ని  వెంటనే అదుపులోకి తీసుకోవాలని అన్నారు. అంతేకాకుండా ఈ అవమానాన్ని భరించలేక అదృశ్యమైన కిరణ్ కు ఏమైనా అపాయం జరుగుతే పూర్తి బాధ్యత చాకలి రాములు కుటుంబమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబానికి ప్రభుత్వం  న్యాయం చేయాలని అన్నారు. రానున్న రోజుల్లో ఇలాగే దళితులపై  దాడులు చేస్తే వారిపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని అన్నారు.

Related posts

విద్వేషం రగిల్చే ప్రసంగం కేసులో అక్బరుద్దీన్ కు నాంపల్లి కోర్టు ఊరట

Satyam NEWS

57 ఏండ్లు నిండిన వారు ఆసరా పింఛన్ కు  దరఖాస్తు చేసుకోండి

Satyam NEWS

వైభవంగా శ్రీ కోదండరాముని పుష్పయాగం…..

Satyam NEWS

Leave a Comment