బిజినపల్లి మండల పరిధిలోని నంది వడ్డేమాన్ గ్రామంలో గల శ్రీ సార్థా సప్త శనేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి మరియు శని త్రయోదశి పురస్కరించుకొని ఈనెల 18న శనివారం నాడు తెల్లవారుజాము నుండి రాత్రి వరకు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వ మఠం విశ్వనాథ శాస్త్రి తెలిపారు.
భక్తులకు తెల్లవారుజాము నుండి శనీశ్వర స్వామి వారికి తిలతల అభిషేక పూజలు అష్టోత్తర పూజలు అర్చనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు బ్రహ్మసూత్రం గల పరమశివునికి బ్రహ్మ ముహూర్తం నుండి లింగోద్భవ సమయం వరకు ప్రత్యేకంగా రుద్రాభిషేకాలు, అర్చనలు, అభిషేకాలు విశేష పూజలు స్వామివారికి నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ ప్రాంత భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని శని గ్రహ దోష మరియు విశేష పుణ్యఫలితాన్ని పొందాలని ఆయన కోరారు. భక్తులు వివరాలకు 9440231325, 8186821212 నంబర్ లో సంప్రదించాలని కోరారు.