32.7 C
Hyderabad
April 27, 2024 01: 41 AM
Slider నల్గొండ

టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధిగా చావా కిరణ్మయి ఎంపిక

#ChavaKranmayeeTDP

టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధిగా చావా కిరణ్మయి ఎంపిక అయ్యారు. సోమవారం టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలంగాణ టిడిపి నూతన కమిటీని ప్రకటించగా జాబితాలో చావా కిరణ్మయి ని ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు.

 కిరణ్మయి గతంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా మూడుమార్లు, టిడిపి రాష్ట్ర కార్యదర్శిగా రెండు విడతలుగా పనిచేశారు.

టిడిపి హుజూర్ నగర్ నియోజకవర్గ ఇంచార్జిగా గత నాలుగు సంవత్సరాలుగా పనిచేస్తున్నారు.  రాష్ట్ర కార్యవర్గంలో కీలకమైన అఫీషియల్ అధికార ప్రతినిధిగా ప్రకటించడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుచరులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.

జడ్పీటిసిగా, ఎంపిటిసిగా ప్రజాప్రతినిధిగా పది సంవత్సరాల పాటు సుదీర్ఘ అనుభవం గడించిన కిరణ్మయి  రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎంపిక కావడంతో టిడిపి కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.

Related posts

అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలి

Bhavani

మెట్రో టీవీ క్యాలెండర్ ఆవిష్కరించిన అదనపు కలెక్టర్

Satyam NEWS

అమాంతంగా పెరుగుతున్న కరోనా కేసులు

Satyam NEWS

Leave a Comment