రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సు కారు ఢీ కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందారు. మంగళవారం రాత్రి రంగారెడ్డి జిల్లా ఆమనగల్ పట్టణ సమీపంలోని సూర్యలక్ష్మి కాటన్ మిల్ సమీపంలో అచ్చంపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ కు చెందిన వినోద్ ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు.
మరో మహిళ గాయపడింది. హైదరాబాద్ నుంచి అచ్చంపేట వైపు వెళుతుండగా వినోద్ శ్రీశైలం దైవ దర్శనానికి వెళ్లి తిరిగి హైదరాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.