తెలంగాణ లో మరో ఎమ్మెల్యేకు కరోనా సోకింది. మిర్యాలగూడా ఎమ్మెల్యే భాస్కర రావుకు కరోనా పాజిటీవ్ వచ్చింది. జలుబు, దగ్గు లక్షణాలు కనిపించడంతో ఆయన కరోనా పరీక్ష నిర్వహించుకున్నారు. ఆ పరీక్షలో ఆయనకు పాజిటీవ్ వచ్చింది. దాంతో ఆయన ఆసుపత్రిలో చికిత్స కోసం ఎడ్మిట్ అయ్యారు.
ఆయన కుటుంబ సభ్యులకు, సహచరులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. వారి ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. మిర్యాలగూడా తాసిల్దార్ తో బాటు ఇద్దరు రెవెన్యూ సిబ్బందికి కూడా కరోనా సోకింది.