29.7 C
Hyderabad
May 6, 2024 04: 36 AM
Slider హైదరాబాద్

బిజెపి మహిళా మోర్చా అసెంబ్లీ ముట్టడి యత్నం

#BJPMahilaMorcha

నిరుపేదలకు డబుల్ బెడ్ రూములు నిర్మించి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వకపోవడంపై ఆందోళన కార్యక్రమాలను బిజెపి చేపట్టింది.

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పిలువు మేరకు నేడు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా మోర్ఛా రాష్ట్ర అధ్యక్షురాలు గీతా మూర్తి ఆధ్వర్యంలో వర్షాన్ని సైతం లెక్క చెయ్యకుండా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు.

అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలని ఈ సందర్భంగా వాడు డిమాండ్ చేశారు. అదే విధంగా ఎల్ ఆర్ ఎస్ పేరుతో రాష్ట్ర ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్న జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ ని సంతృప్తిపరచడానికి ముస్లిం సంతుస్టికరణ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్న టిఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ నేడు ఆందోళన కార్యక్రమాలను చేపట్టినట్లు గీతా మూర్తి తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు నిరంకుశంగా ముందస్తు అరెస్టులు చేస్తున్నారని, ఆందోళన చేస్తున్న కార్యకర్తల పైన లాఠీచార్జిలు, అమానుషంగా  వ్యవహరించడం, అరెస్టులు చేయడం పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

ఆందోళన కార్యక్రమం చేస్తున్న కార్యకర్తలను అసెంబ్లీ బయట పరిసర ప్రాంతాలలో భౌతిక దాడులకు (మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం) పాల్పడడం పట్ల బిజెపి రాష్ట్ర శాఖ తీవ్రంగా ఖండించింది.

Related posts

ధర్మవరం లో ఎమ్మెల్యే అండతో రెచ్చిపోతున్న గూండాలు

Bhavani

డ్రగ్స్ మాఫియాపై సీబీఐ విచారణ ఎందుకు వేయడం లేదు?

Satyam NEWS

న్యూ స్లోగన్: భారీ ఎత్తున ఇంటింటికి అమరావతి ప్రచారం

Satyam NEWS

Leave a Comment