కడప జిల్లా రాజంపేట మునిసిపాలిటీ పరిధిలో 147 మంది విదేశీయులు వచ్చారని వారికి ఆరోగ్య సమస్యలు లేవని వారిని స్వీయ పర్యవేక్షణలో వుంచినట్టు ప్రభుత్వ వైద్యాధికారి వెంకట రెడ్డి మీడియా కు తెలిపారు. ఢిల్లీ నిజాముద్దీన్ కు వెళ్లి వచ్చిన వారి వివరాలు రాగా అందులో ఇద్దరి పేర్లు ఉన్నాయని తెలిపారు. వారు ప్రార్ధన కోసం వెళ్లి వచ్చిన వారితో కలిసి ప్రయాణం చేశారని, వారి రక్త నమూనాలను తిరుపతి కి పంపి ఉన్నామని ఈరోజు లేదా రేపు రిపోర్ట్ రావాల్సి ఉందిని తెలిపారు.
ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారు స్వచ్ఛందంగా వచ్చి ఆరోగ్య పరీక్షలు చేసుకోవాలని, లేదా తెలిసిన వారు తమకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. రాజంపేట మునిసిపాలిటీ పరిధిలో ఏడు మంది కోవిడ్ క్వరంటాయిన్ లో ఉన్నారని తెలిపారు. కోవిడ్ 19 అంబులెన్స్ ను రాజంపేట డివిజన్ కు కేటాయించినారని అనుమానితులను అందులో పరీక్షల కోసం తీసుకెళ్లనున్నట్టు తెలిపారు.