‘‘హిందూ దేవుళ్లను కించపరిచే ఎంఐఎం పార్టీతో ఎందుకు చట్టపట్టా లేసుకొని తిరుగుతున్నావ్ కేసీఆర్…తెలంగాణలో 80% ఉన్న హిందువులంతా సంఘటితమైతే… బీజేపీ అధికారంలోకి రాదా? ‘అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు.
ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 2వ రోజు బస్వాపూర్ నుండి పాదయాత్ర ప్రారంభించిన బండి సంజయ్ సాయంత్రం భువనగిరి పట్టణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా భువనగిరి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ ఉత్తేజ భరతంగా ప్రసంగించారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు… డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిందే. నేను చచ్చిపోతే తెలంగాణ రాష్ట్రం వస్తుందని శ్రీకాంతాచారి ఆత్మబలిదానం చేసుకుంటే తెలంగాణ వచ్చింది. మరి అలాంటి తెలంగాణలో శ్రీకాంతాచారి లక్ష్యం నెరవేరిందా? పోలీస్ కిష్టయ్య త్యాగం నెరవేరిందా? సుమన్, యాదగిరి లాంటి వారి బలిదానాలకు అర్థం ఏది? అని పేదోళ్ల చచ్చిపోతే నే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని స్పష్టం చేశారు… బండి సంజయ్.
అక్రమాలకు అడ్డాగా తెలంగాణ మారిందని.. నయీమ్ బతికున్నప్పుడు పెంచి పోషించింది ఎవరు? 36 బస్తాల డబ్బు సంచులు ఎక్కడికి పోయాయి? నయీమ్ దగ్గర స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు, డబ్బులు ఎక్కడికి పోయాయి? అని..ఏదైనా బీజేపీ వచ్చాక కచ్చితంగా అవన్నీ కక్కిస్తామని… భువనగిరి నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత బీజేపీదే. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు.
శ్రీలంక పరిస్థితే తెలంగాణలో ఉందని… ప్రతి ఒక్కరి తలపై లక్ష పైచిలుకు అప్పు ఉందని. దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వకపోగా… దళితుల భూములను లాక్కుంటూ వారిని ఇబ్బంది పెడుతున్నారు తాగి వాహనం నడిపితే తప్పు అయినప్పుడు… తాగి రాష్ట్రాన్ని నడిపితే తప్పు కాదా? అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు.నేనే నిఖార్సయిన హిందువునని చెప్పుకున్న కేసీఆర్ సిగ్గు లేకుండా హిందూ దేవుళ్లను కించపరిచే ఎంఐఎం పార్టీతో ఎందుకు చట్టపట్టా లేసుకొని తిరుగుతున్నడంటూ కేసీఆర్ నుద్దేశించి మాట్లాడారు.
హిందూ ధర్మానికి ఎవరు అడ్డొచ్చినా… తప్పకుండా మెడలు వంచుతామని… 12శాతం ఉన్న ఎంఐఎం పార్టీ బీహార్ లో ఐదు అసెంబ్లీ స్థానాల్లో గెలిచింది… మరి తెలంగాణలో 80% ఉన్న హిందువులంతా సంఘటితమైతే… ఎందుకు బీజేపీ అధికారంలోకి రాదని గట్టిగా అన్నారు… బండి సంజయ్.ప్రజల కోసం, సమాజం కోసం పనిచేయమని పీఎం మోడీ ఆదేశిస్తేనే…. పాదయాత్ర చేస్తున్నామన్నారు.
కేసీఆర్ కుటుంబంలో బందీ అయిన తెలంగాణ తల్లిని బంధవిముక్తిరాలిని చేద్దాం. కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడి… పేదల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. విశ్వకర్మలకు సహకరిస్తాం…. వారికి భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు.