సాగర్ స్నేక్ సొసైటీ & రెడ్ క్రాస్ కమిటి ప్రధాన కార్యదర్శి కృష్ణ వారి బృందం వారి పిలుపు మేరకు హిందూ వాహిని ఆధ్వర్యంలో రక్త దాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు రోహిత్ మాట్లాడుతూ వనపర్తి పట్టణంలో గల రెడ్ క్రాస్ సొసైటీలో ప్రజల అవసరాల బట్టి ఎన్నో రకాల జ్వరాలు కారణంగా రక్తం నిల్వ ఉండలేక పోతున్న అత్య వసర సమయం లో హిందూ వాహిని ఆధ్వర్యంలో 10 మంది కార్యకర్తలతో రక్తం ఇచ్చారు. ప్రజలు ఎన్నో రకాలుగా ప్రతి చోతో ఎన్నో సార్లు ఇవ్వడం జరిగిందన్నారు.
ఇకపై కూడా హిందూ వాహిని తరపున ప్రజలకు ఎన్నో రకాలుగా అండగా ఉంటామని, అంతే కాకుండా రక్త దానం మహా దానం అని ప్రతి ఓక్కరు కూడా రక్త దానానికి సహకరించి ఒకరికి ఒకరు సహాయ పడి ప్రజలేవరు కూడా అనారోగ్యనికి పడకుండా జాగ్రత్త పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని ప్రధాన కార్యదర్శి రాకేష్ గో ప్రముఖ్ మూర్తీ , రవి, భరత్, బంటి తదితర హిందూ వాహిని కార్యకర్తలు రెడ్ క్రాస్ సొసైటీ, హిందూ వాహిని కార్యకర్తలు పాల్గొన్నారు.
పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్