అధికారంలోకి రాగానే వంద రోజుల్లో ఏబిసిడి వర్గీకరణ చేస్తానని చెప్పి యావత్ మాదిగ జాతిని బిజెపి మోసం చేసిందని కొల్లాపూర్ నియోజక వర్గం భారత రాష్ట్ర సమితి నాయకులు డీకే మాదిగ అన్నారు. 2014 ఎలక్షన్ లో వర్గీకరణ చేస్తానని హామీ ఇచ్చిన బిజెపి మాట తప్పిందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి బయటి మీటింగ్ లలో మాట్లాడడం కాదు. ఎస్సీ వర్గీకరణ అంశం పార్లమెంట్లో మాట్లాడలని ఆయన డిమాండ్ చేశారు. 22వ తారీఖు నాడు నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లిలో దళిత గిరిజన ఆత్మగౌరవ సభలో కాంగ్రెస్ పార్టీ టిపిసిసి రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఏబీసీడీ వర్గీకరణకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాదిగల జనాభా ఎక్కువ ఉన్నందున పదేపదే మాదిగలను ఉద్దేశించి ఆయన మాట్లాడు తున్నారని, నిజంగా రేవంత్ రెడ్డి కి చిత్తశుద్ధి ఉంటే, రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణ బిల్లుకు అనుకూలంగా మాట్లాడాలని కోరారు.