తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలంతా బిజెపిలో చేరబోతున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు బిజెపితో ఈ మేరకు చర్చలు జరుపుతున్నారు. ఈ విషయాలన్నీ ఏవో ఊహాగానాలు కాదు బిజెపి ఎమ్యెల్సి సోము వీర్రాజు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో త్వర లో టిడిపి ఖాళీ కావడం ఖాయమని ఆయన వెల్లడించారు. అదే విధంగా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చే వారినందరిని చేర్చుకుని శాసన సభ లో బిజిపి ప్రాతినిధ్యం తెచ్చుకుంటామని ఆయన స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి త్వరలోనే చాలా మంది నేతలు బిజెపిలోకి రాబోతున్నారని కూడా ఆయన చెప్పారు. రాష్ట్రం లో చంద్రబాబు మాటలు ఎవరూ నమ్మే పరిస్థితి లేదని ఆయన అన్నారు.
previous post