27.7 C
Hyderabad
May 16, 2024 06: 19 AM
Slider నెల్లూరు

వెంకటగిరి పట్టణానికి వెలుగులు నింపిన తిరుపతి ఎంపీ

#tirupati

మరో రెండు రోజుల్లో జాతర ప్రారంభం కానున్న సందర్భంలో వెంకటగిరి పట్టణానికి నగర సుందరీకరణలో భాగంగా 87 లక్షల రూపాయల ఎంపీ నిధులతో నగరం మొత్తం 1969 ఎల్.ఇ.డి లైట్లను ఏర్పాటు చేయనున్నారు. అందులో భాగంగా ఏర్పాటు చేసిన లైట్లను ఎంపీ గురుమూర్తి స్విచ్ ఆన్ చేసి వెలిగించారు.

స్థానిక శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ జాతర లోపల మొత్తం పూర్తి చేయాలి అనుకొన్న కార్యక్రమంలో కాస్త జాప్యం జరిగినదని జాతర సమయానికి మొత్తం పూర్తి చేస్తామని కొంచం పనులు మిగిలినా కూడా జాతర తరువాత పూర్తి చేస్తామని తెలియజేసారు. స్థానిక శాసనసభ్యులు వెంకటగిరి పట్టణానికి నిధులు మంజూరు చేసినందుకు ఎంపీ గురుమూర్తి కి ధన్యవాదములు తెలియజేసారు.

వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి అభ్యర్థనతో నిధులు మంజూరు చేయడం జరిగిందని, ఉప ఎన్నికలో నా వెంట నడచిన వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని ఎంపీ గురుమూర్తి చెప్పారు. వెంకటగిరి అభివృద్ధిలో భాగం కావడం సంతోషంగా ఉందని  మునుముందు ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహనరెడ్డి సహకారంతో  మండల స్థాయిలో కూడా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతామని తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటరమణా రెడ్డి,  మునిసిపల్ చైర్మన్ నక్కా భానుప్రియ, నెల్లూరు జిల్లా గ్రంధాలయ చైర్మన్ దొంతు శారద, మునిసిపల్ వైస్ ఛైర్మెన్లు ఎస్ బాలయ్య, సిహెచ్ ఉమా మహేశ్వరీ, మాజీ ఎన్.డి.సి.సి.బి చైర్మన్ మెట్టుకురు ధనుంజయ రెడ్డి మరియు పోలీసు సిబ్బంది, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

Related posts

స‌ర్వ‌భూపాల వాహ‌నంపై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప

Satyam NEWS

మదర్సాల్లో చదివే వారికి ఉపకార వేతనం నిలిపివేత

Satyam NEWS

మంత్రిని దూషించిన బిజెపి నేతపై ఫిర్యాదు

Satyam NEWS

Leave a Comment