26.7 C
Hyderabad
May 3, 2024 07: 21 AM
Slider మహబూబ్ నగర్

మంత్రిని దూషించిన బిజెపి నేతపై ఫిర్యాదు

#wanaparthypolice

వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో  మంత్రి నిరంజన్ రెడ్డిని దూషించి మాట్లాడిన   బిజెపి నేతపై చర్యలు తీసుకోవాలని వనపర్తి టౌన్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశామని టిఆర్ఎస్ సీనియర్ నేత,మాజీ కౌన్సిలర్ ఉంగలం తిరుమల్ తెలిపారు.

ప్రసంగంలో వనపర్తి శాసనసభ్యుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి  నిరంజన్ రెడ్డిపై దురుద్దేశంతో రాజకీయ అక్కసుతో దుర్భాషలాడినందుకు ఎస్ఐ యుగంధర్ రెడ్డికి పిర్యాదు ఇచ్చామన్నారు. వనపర్తి ప్రజానికం సహించడం లేదని, దశాబ్ద కాలం నుండి వనపర్తి ప్రజల చిరకాల కోరిక అయిన రోడ్ల విస్తరణ, పట్టణ ప్రధాన రహదారుల్లో సీసీ రోడ్లు, అనేక  అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే రాజకీయ దురుద్దేశంతో అక్కస్సుతో మంత్రిని అకారణంగా దుర్భాషలాడడం సహించరాని నేరం అని,బిజెపి నేతపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ ఎస్సైని కోరారు. మంత్రిని దురుద్దేశంతో అక్కస్సుతో దూషిస్తే, రాబోయే కాలంలో వనపర్తి ప్రజలు యువకులు నేతకు గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

Protest: పలుచోట్ల విజయవంతమైన జాతీయ బంద్

Satyam NEWS

ఓటర్ల జాబితాలో చేర్పులు మార్పులు

Murali Krishna

వాట్సాప్ ద్వారా జేఈఈ, నీట్, ఎంసెట్ గ్రాండ్ టెస్ట్స్

Satyam NEWS

Leave a Comment