మండు వేసవిలో మాడు పగిలే ఎండలకు బదులు.. చల్లబడ్డ వాతావరణం
ఏపీలో ని విశాఖ వాతావరణ శాఖ ముందు గా హెచ్చరించిన విధంగా.. రాష్ట్రం మొత్తం వాతావరణం చల్లబడింది. రాగల రెండు, మూడు రోజుల్లో తేలికపాటి వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ రెండు రోజుల క్రితమే చెప్పింది. దీంతో గురువారం అంటే 22 వ తేదీన ఉదయాన్నే ప్రచండ భానుడి తన కిరణాల తో ప్రజలను లేపేవాడు.కానీ పొద్దున్న లేవంగానే ఆకాశం మేఘావృతమైంది.
దీంతో వేడి శెగల వాతావరణం తో ఏపీ ప్రజలను తెల్లవారుజామున పలకరించాల్సిన సూరిబాబును మబ్బులు కమ్మేడం…ఫలితంగా వేడి వాతావరణం రాకపోవడం దీనికి ఉక్కపోతకు కాస్త ఉపశమనం కలిగిందనే చెబుతోంది.. సత్యం న్యూస్. నెట్.ఇక అనుకోని, ఊహించని వాతావరణం అదీ మండు వేసవిలో.. మాడు పగిలేలా ఎండలు ఉంటున్న ఈ వేసవిలో ఆకస్మాత్తుగా ఈ పరిణామానికి కారణాలను అన్వేషించే పనలో పడ్డారు.. వాతావరణ అధికారులు.