27.7 C
Hyderabad
May 4, 2024 10: 36 AM
Slider ముఖ్యంశాలు

అవినీతి పాలనకు చరమగీతం పాడాం

#indupriya

కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ గా గడ్డం ఇందుప్రియ ఎన్నిక

కామారెడ్డి మున్సిపాలిటీలో నాలుగు సంవత్సరాలు 3 నెలల అవినీతి పాలనకు చరమగీతం పాడామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. ఇకపై మున్సిపాలిటీలో అవినీతి రహిత పాలన అందిస్తామన్నారు. కామారెడ్డి బల్దియా చైర్మన్ ఎన్నిక అనంతరం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం నిర్వహించారు. చైర్మన్ గా ఎన్నికైన గడ్డం ఇందుప్రియకు శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం షబ్బీర్ అలీ మాట్లాడుతూ..  కామారెడ్డి ఎమ్మెల్యే ఎక్స్ అఫిషియో ఓటుతో కలిపి 50 మంది సభ్యులున్నారని, చైర్మన్ ఎన్నికకు 26 మంది మద్దతు అవసరం కాగా 29 ఓట్లు వచ్చాయని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో చైర్మన్ గా గడ్డం ఇందుప్రియ ఎన్నికయ్యారని, వైస్ చైర్మన్ గా త్వరలోనే ఉరుదొండ వనిత ఎంపిక అవుతారని ప్రకటించారు. మున్సిపాలిటీలో సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక దృష్టి పెడతామని తెలిపారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డితో కామారెడ్డి మున్సిపాలిటీ కౌన్సిలర్లతో కలిసి సమావేశమవుతామని, మున్సిపాలిటీకి ప్రత్యేక నిధులు తెచ్చి రాబోయే 8 నెలల్లో బెస్ట్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.

మున్సిపాలిటీలో భగీరథ పైప్ లైన్ సరిగ్గా చేయకపోవడం వల్ల ప్రజలకు సరిపడా నీళ్లు రావడం లేదని, ఎన్నికల తర్వాత సీఎం సమక్షంలో మిషన్ భగీరథ అధికారులతో సమావేశం నిర్వహించి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని తెలిపారు. ఇందిరాగాంధీ స్టేడియంలో 24 గంటల లైటింగ్ సౌకర్యం కల్పించి జాతీయ స్థాయి స్టేడియంకు కావాల్సిన వసతులు కల్పిస్తామన్నారు.

పట్టణంలో తాను చదువుకున్న ప్రభుత్వ బాలుర పాఠశాల కూలిపోయే స్థితిలో ఉందని, 2-3 కోట్ల వ్యయంతో కార్పొరేట్ పాఠశాలను తలదన్నే రీతిలో నూతన పాఠశాల నిర్మాణం చేపడతామని, పాఠశాలకు కావాల్సిన ఇతర వసతులు సొంత డబ్బుతో ఏర్పాటు చేస్తానన్నారు. కామారెడ్డిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని, నూతన బ్రిడ్జిల ఏర్పాటుకు శ్రీకారం చుడతామన్నారు. రైల్వే అధికారుల సమన్వయంతో ముందుకు వెళ్తామని తెలిపారు.

8 లక్షల కోట్ల అప్పుతో చేతికి చిప్ప ఇచ్చారు

2014 నాటికి 10 వేల కోట్ల మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రాన్ని మాజీ కేసీఆర్ ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పుతో చేతిలో చిప్ప పెట్టిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఇప్పటికే 5 గ్యారెంటీలు పూర్తి చేసామన్నారు. 90 రోజుల్లో 31 వేల ఉద్యోగాలిచ్చి చరిత్రలో నిలిచామని, ఎన్నికల కోడ్ తర్వాత మరొక 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ఏడాదిలో లక్ష ఉద్యోగాలు ఇవ్వడమే టార్గెట్ అని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు సిగ్గు, శరం లేకుండా మాట్లాడుతున్నారని, ఆకాశంపై అమ్మితే మనపైనే పడుతుందని మర్చిపోతున్నారని విమర్శించారు.

మండలం పేరు తెలియని బిబిపాటిల్

బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో ఎంపీ బిబిపాటిల్ కేంద్రం నుంచి గాని, రాష్ట్రం నుంచి గాని పైసా పని చేయలేదన్నారు. పార్లమెంట్ పరిధిలో ఒక్క మండలం పేరు కూడా ఆయనకు తెలుసా అని ప్రశ్నించారు. పార్లమెంటులో ఇక్కడి సమస్యలపై ఒక్కసారి కూడా మాట్లాడలేదని, కనీసం రైల్వే బ్రిడ్జి కూడా మంజూరు తేలేకపోయారని విమర్శించారు. వచ్చే ఎంపీ ఎన్నికల్లో పిలిస్తే పలికే సురేష్ షెట్కార్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

కేసీఆర్ కుటుంబం జైలుకే

ఇప్పటిదాకా రాష్ట్రంలో కేసీఆర్, కేటీఆర్ ఫ్యామిలీ లీడర్ షిప్ పాలన కొనసాగిందని, ప్రస్తుతం ప్రజా పాలన నడుస్తోందన్నారు. నాడు పిసిసి హోదాలో ఫోన్ ట్యాపింగ్ పై చెప్పిన మాటలు నేడు నిజమని తేలాయన్నారు. కేంద్రం అనుమతి లేకుండా ట్యాపింగ్ చేసి నాయకులు, భార్యాభర్తల మాటలు విన్నారని, వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలిగించారన్నారు. తనకున్న సమాచారం ప్రకారం త్వరలో కేసీఆర్ కుటుంబం జైలుకు పోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇది తన అభిప్రాయం మాత్రమేనని తెలిపారు.

ఇండియా కూటమి గెలుపు

మోడీ ఝూటా మాటలతో యువతను మోసం చేసారని, ఉద్యోగాలు ఇస్తామని మాట తప్పారన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే రాష్ట్రానికి మేలు జరుగుతుందని, ప్రత్యేక నిధులతో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. దేశంలో ఇండియా కూటమిని గెలిపించుకుంటామన్నారు.

సత్యం న్యూస్, కామారెడ్డి

Related posts

భ‌ద్రాచ‌లం ఘ‌ట‌న‌.. ప్ర‌భుత్వోద్యోగుల‌కు నిజ్జంగా హ్యాట్సాఫ్‌!!!

Sub Editor

ఈనెల 21న వరాహస్వామి జయంతి వేడుకలు

Satyam NEWS

వాళ్లతో  పోల్చకండి

Murali Krishna

Leave a Comment