27.7 C
Hyderabad
May 4, 2024 08: 33 AM
Slider మహబూబ్ నగర్

సీఎం కేసీఆర్ చిత్రపటానికి కాంట్రాక్ట్ అధ్యాపకుల క్షీరాభిషేకం

#contractlecturers

కాంట్రాక్ట్ అధ్యాపకులను క్రమబద్దీకరిస్తునట్లు అసెంబ్లీలో ప్రకటించడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చిత్రపటానికి నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో క్షీరాభిషేకం చేశారు. కొల్లాపూర్ లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో కాంట్రాక్ట్ అధ్యాపకులు ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఉన్నతే లక్ష్యంగా పని చేస్తున్నారని వారన్నారు.  క్రమబద్ధీకరణ అంశాన్ని ప్రకటించిన ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ లెక్చరర్లు శ్రీనివాస రావు , దశరధరాము, ప్రవీణ్ కుమార్, రాగమై, మయూరి తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.

Related posts

మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం సిద్ధం

Bhavani

నీట్, జేఈఈ విద్యార్థులకు ఈ-మెటీరియల్ డిజిటల్ కార్డు

Satyam NEWS

ట్రీ ప్లాంటేషన్: లంగర్ హౌస్ లో నేడు గ్రీన్ ఛాలెంజ్

Satyam NEWS

Leave a Comment