కాంట్రాక్ట్ అధ్యాపకులను క్రమబద్దీకరిస్తునట్లు అసెంబ్లీలో ప్రకటించడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చిత్రపటానికి నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో క్షీరాభిషేకం చేశారు. కొల్లాపూర్ లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో కాంట్రాక్ట్ అధ్యాపకులు ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఉన్నతే లక్ష్యంగా పని చేస్తున్నారని వారన్నారు. క్రమబద్ధీకరణ అంశాన్ని ప్రకటించిన ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ లెక్చరర్లు శ్రీనివాస రావు , దశరధరాము, ప్రవీణ్ కుమార్, రాగమై, మయూరి తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.