23.2 C
Hyderabad
May 8, 2024 01: 53 AM
Slider హైదరాబాద్

ట్రీ ప్లాంటేషన్: లంగర్ హౌస్ లో నేడు గ్రీన్ ఛాలెంజ్

green challenge

ఇంటర్నేషనల్ వైశ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నేడు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం జరిగింది. లంగర్ హౌస్ లోని శిశు మందిరిలో జరిగిన ఈ కార్యక్రమంలో 400 చెట్లు నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని కొనసాగించేందుకు ప్రతినబూనారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు, చిన్నారులు పాల్గొని మొక్కలు నాటారని ఉప్పలా శ్రీనివాస్ గుప్తా తెలిపారు. ఈ సందర్భంగా 33 జిల్లాలు ఉన్న ఇంటర్నేషనల్ వైశ్ ఫెడరేషన్  సభ్యులు చెట్లు  నాటాలని ఆయన గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. ఈ నెల17 వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు జరగబోతున్నది.

ఈ సందర్భంగా  ఇంటర్నేషనల్ వైశ్ ఫెడరేషన్ సభ్యులే కాకుండా, అన్ని సంఘాలు వారూ మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. అదే విధంగా దేశంలోని అన్ని రాష్ట్రాల ఇంటర్నేషనల్ వైశ్ ఫెడరేషన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటాలని ఆయన కోరారు. తెలంగాణ ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు పలు రాష్ట్రాలకు చెందిన నాయకులు స్పందిస్తున్న విషయం తెలిసిందే.

Related posts

టి-సాట్ ను సందర్శించిన ఇండియన్ ఇన్మఫర్మేషన్ సర్వీసు అధికారులు

Satyam NEWS

వచ్చే నెల 8వ తేదీన బి.సి. లిటరరీ ఫెస్టివల్-2019

Satyam NEWS

గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన యువ హీరో సుధీర్ బాబు

Satyam NEWS

Leave a Comment